వధువు సూసైడ్.. వరుడే రీజన్ !

by  |
వధువు సూసైడ్.. వరుడే రీజన్ !
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అత్తారింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లికి చెందిన అక్షయ్ అనే యువకుడు త్రినేయని అనే యువతిని 7 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అయితే, ఆ యువతి సోమవారం తెల్లవారు జామున ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు తాళలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed