పండగ రోజు భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య

by  |
పండగ రోజు భర్త చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య
X

దిశ వెబ్‌డెస్క్: దేశంలో చాలామంది తమ ఆచారాల విషయంలో చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. మరికొంతమంది ఆచారాల విషయంలో పట్టుదలగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చత్తీస్‌ఘడ్‌లో ఇదే జరిగింది. తన భర్త మత విశ్వాసాలను కాదని పండగ రోజు చికెన్ తిన్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..మనీషా సింగ్ (19) ఆదివారం రక్షా బంధన్ రోజున తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి సొంత ఊరికి చేరుకున్నారు.

కాసేపటికే మనీషా భర్త ఆకలేస్తుందంటూ పక్కనే ఉన్న తన అత్తగారింటికి భోజనానికి వెళ్లాడు. అక్కడ వారు చికెన్ వండటంతో మనీషా భర్తని తినవద్దని వారించింది. ఈ రోజు రక్షాబంధన్, శ్రావణ మాసం చివరి రోజని చెప్పింది. అయినప్పటికి భార్య మాట వినని రామజన్మ చికెన్ తిన్నాడు. కాసేపటి తర్వాత రామజన్మ ఆమెకు నచ్చజెప్పడానికి ఇంటికి వెళ్లగా, అప్పటికే ఆమె క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే ఆమెను అంబికాపూర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ లాభం లేకపోయింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

Next Story

Most Viewed