- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: భర్త మరోకరితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని మొదలైన అనుమానం దారుణానికి తెరలేపింది. తనను కాదని మరొకరితో సంబంధం సాగిస్తావా అంటూ భార్య భర్త పై యాసిడ్ పోసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన నరసింహారావు (50), లక్ష్మీ భార్యభర్తలు. అయితే, గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నరసింహారావు వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న అనుమానంతో లక్ష్మీ నిలదీసేది. ఇదే తరుణంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆ గొడవ కాస్తా ముదిరింది. ఇక భర్తపై తీవ్ర కోపం తెచ్చుకున్న భార్య లక్ష్మీ ఇంట్లో నుంచి యాసిడ్ తీసుకొచ్చి మొహం మీద పోసింది. అది కాస్తా కంటిలో పడడంతో నరసింహారావు ఆ మంట తట్టుకోలేక బయటకు పరుగులు తీశాడు. ఇది గమనించిన స్థానికులు ఆయనను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు విషయం పై ఆరా తీస్తున్నారు.