పంత్ సహా మరొకరికి పాజిటివ్.. క్లారిటీ ఇచ్చిన BCCI

by  |
Rishab-Pant
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్ ఇండియా జట్టులో కరోనా కలకలం సృష్టించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ 20 రోజుల సెలవులు మంజూరు చేసింది. దీంతో బయోబబుల్ దాటి క్రికెటర్లు బయట పర్యటిస్తూ సెలవులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సెలవులే క్రికెటర్ల పాలిట శాపంగా మారాయి.

టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్, సహాయక సిబ్బంది దయానంద గారాని కరోనా బారిన పడ్డారు. అయితే, గారానికి సీనియర్​ ఆటగాడు వృద్ధిమాన్ సాహా సహా మరొకరు సన్నిహితంగా ఉండటం వల్ల ఈ ముగ్గురిని ఐసోలేషన్‌లోకి పంపారు. క్రికెటర్లకు కరోనా సోకినట్టు బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్‌రో పేర్కొంది.

https://twitter.com/BCCI/status/1415660631752024068?s=20

Next Story

Most Viewed