- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 43మందికి కరోనా పరీక్షలు చేయిస్తామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టంచేశారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి గత పదేండ్ల కిందటే గ్రామాన్ని వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసొచ్చాడు.ఈ మధ్యే అతనికి కరోనా పాజిటివ్ రావడంతో నగరంలో చికిత్స పొందుతూ మరణించాడు.విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు హాజరైన 43 మంది వ్యక్తులను గుర్తించామని, వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Next Story