కరోనా మహమ్మారితో ఐపోలేదు : WHO

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-08 02:31:27  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదని, మున్ముందు మరిన్ని ఉపధ్రవాలు వచ్చే అవకాశం లేకపోలేదని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడగా.. 8,88,326 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్‌ల విజృంభణ, మహమ్మారులు జీవితంతో ఒక భాగం. భవిష్యత్‌లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు రెడీ ఉండాలని సూచించారు. ఇప్పటి కంటే చాలా [&hellip;]</p>

కరోనా మహమ్మారితో ఐపోలేదు : WHO
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదని, మున్ముందు మరిన్ని ఉపధ్రవాలు వచ్చే అవకాశం లేకపోలేదని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడగా.. 8,88,326 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

‘ఇదే చివరి మహమ్మారి కాదు. వైరస్‌ల విజృంభణ, మహమ్మారులు జీవితంతో ఒక భాగం. భవిష్యత్‌లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు రెడీ ఉండాలని సూచించారు. ఇప్పటి కంటే చాలా మెరుగ్గా ఉండాలని, భవిష్యత్‌లో ప్రజారోగ్యంపై అన్ని దేశాలు భారీగా ఖర్చుచేయాలని’ టెడ్రోస్ వెల్లడించారు.

Next Story