WTC Final.. టీమిండియా జట్టుపై ఐసీసీ సూటి ప్రశ్న

by  |
WTC Final.. టీమిండియా జట్టుపై ఐసీసీ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే తొలి వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌ కావడం.. భారత్-న్యూజీలాండ్ తలపడనుండడంతో మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 15 మందితో కూడిన స్వ్కాడ్‌ను ఇరు జట్లు ప్రకటించాయి.

హెడ్‌కోచ్ రవిశాస్త్రితో టీమిండియా 15 మంది ఆటగాళ్లు దిగిన ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోను జట్టులోని ఆటగాళ్లు అందరూ సోషల్ మీడియా అకౌంట్‌లల్లో అప్‌లోడ్ చేయడంతో చక్కెర్లు కొడుతోంది. ఇదే ఫోటోను‌ అధికారిక ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన ఐసీసీ మాత్రం ఓ సూటి ప్రశ్న వేసింది. ఈ ఆటగాళ్ళలో ఎవరు ప్లేయింగ్ XI లో కనిపిస్తారని మీరు అనుకుంటున్నారు.. అంటూ నెటిజన్లను ప్రశ్నించింది. దీంతో క్రికెట్ అభిమానులు తమ డ్రీమ్ టీమ్‌ను ప్రకటిస్తూ రిట్వీట్ చేస్తున్నారు.

Next Story