- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,తెలంగాణ బ్యూరో : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయినా ఆ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదని ఏఐసీసీ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీమ్ బ్లూ డైరీపై, స్వాధీనం చేసుకున్న వేల ఎకరాల భూములపై, కోట్లరూపాయల పై సిట్ జరిపిన దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఆరోపణలు ఉన్న వారిపై సిట్ కేసులు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు.
ఐదేళ్లుగా చార్జిషీటు ఎందుకు నమోదు చేయలేదని, ఇప్పటి వరకు ఎంత మంది బాధితులకు న్యాయం చేశారో తెలపాలని ఆయన కోరారు. సీబీఐ ఎంక్వైరీ చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడానికి కారణం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్యాంగ్స్టర్ నయీమ్తో చేతులు కలపినందుకేనా అని ప్రశ్నించారు.