ఉద్యమకారులకు మీరేం చేశారు కేసీఆర్.. : చెరుకు సుధాకర్

by  |
Cheruku Sudhakar
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో పునాది రాళ్ల పాత్రను పోషించిన కార్యకర్తలకు ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పాలంటూ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్​చేశారు. మంగళవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు, అమరవీరులకు సరైన గుర్తింపు లభించడం లేదన్నారు. టీఆర్ఎస్​పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం హైటెక్స్‌లో నిర్వహించిన ప్లీనరీలో తొలి నాటి లీడర్లకు ప్రాధాన్యత‌ను ఇవ్వకపోవడం బాధకరమన్నారు. అంతేగాక అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ప్రతీ పథకంపై సెల్ఫ్​ డబ్బా కొట్టుకున్నారన్నారు.

ప్లీనరీ కేవలం హుజూరాబాద్​ ఎన్నికల కోసమే పెట్టినట్టు తెలిపారు. ఈ ప్రభుత్వం హయంలో అన్నీ నియంతృత్వమేనన్నారు. కోట్ల మందికి జీవనదారమైన వరికి ఉరిశిక్ష వేస్తూ సిద్దిపేట కలెక్టర్ జైళ్లకు పంపుతామని, కిలో వరి ధాన్యం దొరికినా సస్పెండ్​చేస్తామని అధికారులను బెదిరించడం వెనక అంతర్యామేమిటని ప్రశ్నించారు. కేసీఆర్​పాలనలో దోపిడీ దారులకు లాభం చేకూరుతుందన్నారు.


Next Story

Most Viewed