T20 వరల్డ్ కప్ : ఉత్కంట పోరులో విండీస్ విజయం

by  |
T20 వరల్డ్ కప్ : ఉత్కంట పోరులో విండీస్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో విండీస్ ఘనవిజయం సాధించింది. చివరి బంతి వరకు బంగ్లాదేశ్ VS వెస్ట్ ఇండీస్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు విండీస్ జట్టును కట్టడి చేయడంతో 120 పరుగుల కంటే ఎక్కువ చేయలేదనుకున్న సమయంలో.. ఓపెనర్ రోస్టన్ చేస్ మ్యాచ్ ఆరంభంలో 39 పరుగులు రాబట్టగా.. చివర్లో పూరన్ 40, హోల్డర్ 15 పరుగులు ధాటిగా ఆడటంతో 142 పరుగులు చేసింది.

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టీం ఒక దశలో గెలుపు లాంఛనమే అన్న రీతిలో ఆడింది. లిటన్ దాస్ 44 పరుగులు, మహ్మదుల్లా 31 పరుగులతో బంగ్లాను గెలుపు దిశగా నడిపించారు. కానీ, చివర్లో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ జట్టు 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో బంగ్లా సెమీస్ ఆశలు గల్లంతవ్వగా.. విండీస్ కు మాత్రం సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.


Next Story