కేంద్రం బాటలో పశ్చిమ బెంగాల్..!

by  |
కేంద్రం బాటలో పశ్చిమ బెంగాల్..!
X

దిశ వెబ్‎డెస్క్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం బాటలో పశ్చిమబెంగాల్ నడుస్తోంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను నడిపేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రెండు రోజుల వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసినట్లు తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం అసెంబ్లీలోకి వచ్చే ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed