- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్పై కేంద్ర ప్రభుత్వం పిలువడంపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దొడ్డిదారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభిర్ణించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని ఆక్షేపించారు. గత వారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై దాడి ఘటన తర్వాతి రోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్పై రావాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారిని పంపించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించలేదు. మరోసాకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ వీలైనంత తర్వగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని కోరింది.