వెస్లీ కాలేజ్ సంతోష్‌కు అరుదైన గౌరవం.. ఆ విభాగంలో డాక్టరేట్

by  |
వెస్లీ కాలేజ్ సంతోష్‌కు అరుదైన గౌరవం.. ఆ విభాగంలో డాక్టరేట్
X

దిశ, సిటీ బ్యూరో : సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బోధించే బైరబోయిన సంతోష్ కుమార్‌ను డాక్టరేట్ వరించింది. రాజస్థాన్‌లోని shri jagdishprasad jhabarmal tibrewala universityలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ‘సెక్యూర్ మైనింగ్ ఆఫ్ టాప్-కే అసోసియేషన్ రూల్స్ ఫ్రమ్ వర్టికల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా బేస్’ అనే అంశంపై డాక్టరేట్ పట్టా పొందారు.

వెస్లీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. యౌహాన్, డా.ఎస్.కే యాదవ్ పర్యవేక్షణలో సంతోష్ పీహెచ్‌డీని పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సంతోష్ గత పదేళ్లుగా ఇంజనీరింగ్, ఎంసీఏ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్‌ను బోధించి ఎందరినో ప్రయోజకులుగా తీర్చి దిద్దారు. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ రావడంతో వెస్లీ కళాశాల యాజమాన్యం, ఆయన సన్నిహితులు అభినందించారు.



Next Story