‘మత్తు’కు నెలవుగా విశాఖ మన్యం.. రూ.4కోట్ల గంజాయి పట్టివేత

by  |
‘మత్తు’కు నెలవుగా విశాఖ మన్యం.. రూ.4కోట్ల గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న సుమారు 2,100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం గుమ్మాసిరగంపుట్టు దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ.4కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఇదంతా ఎక్కడ పండించారు. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed