పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి.. 20 మందికి గాయలు

by  |
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి.. 20 మందికి గాయలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరామపేట వద్ద చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. శివరామపేటలో గురువారం ఓ వివాహం జరిగింది. వరుడు గ్రామమైన మరూట్ల తండా నుంచి పెళ్లికి వెళ్లిన బంధువులు సాయంత్రం ట్రాక్టర్‌లో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు.

ఈ క్రమంలో శివరామపేట వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముబీనా (20) మృతి చెందింది. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed