- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather Alert: దూసుకొస్తున్న ద్రోణి.. తెలంగాణకు భారీ వర్ష సూచన!
తెలుగు రాష్ట్రాల్లో రానున్న3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దిశ, వెబ్డెస్క్: ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (India Meteorological Department) చల్లని కబురు చెప్పింది. కర్ణాటక (Karnataka) నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఒక ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే, కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. అదేవిధంగా రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.






