ఆలయాలను పునర్ నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి

by  |
ఆలయాలను పునర్ నిర్మిస్తాం: మంత్రి వెల్లంపల్లి
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ హయాంలో కూల్చిన ఆలయాలను పునర్ నిర్మిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల8న ఉదయం11.01గం.లకు ఆలయాలకు సీఎం జగన్ శంకు స్థాపన చేస్తారని చెప్పారు. 13 జిల్లాల్లో 40 దేవాలయాల పునర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రూ.70 కోట్లతో దుర్గగుడి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. రామతీర్థం ఘటన వెనుక నిజాలు సీఐడీ విచారణలో బయటపడుతాయని చెప్పారు.


Next Story