26న ట్రాక్టర్ ర్యాలీ: యోగేంద్ర యాదవ్

by  |
26న ట్రాక్టర్ ర్యాలీ: యోగేంద్ర యాదవ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఈనెల 26న ఢిల్లీ ఓఆర్ఆర్ పై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు రైతు సంఘం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. జాతీయ పతాకాలతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. తమ ర్యాలీతో గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని పేర్కొన్నారు. కాగా రైతులతో కలిసి పోరాడుతున్న వారిపై ఎన్ఐఏ కేసులు పెడుతోందని మరో నేత దర్శన్ పాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని రైతు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అన్ని మార్గాల్లో తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే 2024 వరకు పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.

Next Story