ఆరు నెలల్లో ‘బేగంపేట’రూపురేఖలు మార్చుతాం

by  |
ఆరు నెలల్లో ‘బేగంపేట’రూపురేఖలు మార్చుతాం
X

దిశ, న్యూస్​బ్యూరో : బేగంపేటలో ఐదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన శ్మశానవాటికను అభివృద్ధి పనులను జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ ఆదివారం పరిశీలించారు. నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించారు.ఈ సందర్భంగా మేయర్​ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు,నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నట్టు తెలిపారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫారాలు, పార్కింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మరో ఆరునెలల్లో పూర్తిచేస్తామని మేయర్​ వివరించారు.

Next Story

Most Viewed