- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: సినిమా టికెట్ల ధర విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి సీఎం వైఎస్ జగన్కు చేసిన ట్వీట్పై మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చిరంజీవితో పాటు చాలా మంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు జీవో 35 లో ఉన్నటువంటి రేట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు.
సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉందని.. అయితే ప్రస్తుతం తాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రేట్ల విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ హడావిడిలో సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారని, త్వరలోనే ఈ అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అందరికీ అందుబాటులోకి వినోదాన్ని తీసుకురావాలనే అంశంపై కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.