- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చైనాతో రెండు యుద్ధాలు.. జయం మనదే’
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తున్నదని, ఈ రెండింటిలోనూ మనదేశమే తప్పక గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రెండు యుద్ధాల్లో రాజకీయాలకు తావివ్వద్దని తెలిపారు. సరిహద్దుల్లో ఒక యుద్ధమైతే, వుహాన్లో వెలుగుచూసిన కరోనా మహమ్మారిపై పోరాటం రెండో యుద్ధమని పేర్కొన్నారు. ఈ రెండు యుద్ధాల్లో కలిసికట్టుగా పోరాడి గెలవాలని అన్నారు. అలాగే, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపైనా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో సుమారు 25వేల యాక్టివ్ కేసులున్నాయని, ఇందులో దాదాపు 12వేల […]</p>

X
న్యూఢిల్లీ: చైనాతో భారత్ రెండు యుద్ధాలు చేస్తున్నదని, ఈ రెండింటిలోనూ మనదేశమే తప్పక గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రెండు యుద్ధాల్లో రాజకీయాలకు తావివ్వద్దని తెలిపారు. సరిహద్దుల్లో ఒక యుద్ధమైతే, వుహాన్లో వెలుగుచూసిన కరోనా మహమ్మారిపై పోరాటం రెండో యుద్ధమని పేర్కొన్నారు. ఈ రెండు యుద్ధాల్లో కలిసికట్టుగా పోరాడి గెలవాలని అన్నారు. అలాగే, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపైనా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో సుమారు 25వేల యాక్టివ్ కేసులున్నాయని, ఇందులో దాదాపు 12వేల మంది హోం ఐసొలేషన్లో ఉండి కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరాలను సులువుగాతీర్చే చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఒక్క కాల్ చేస్తే చాలు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తామని వివరించారు.
Next Story






