ఆ అంశంపై సీఎం దృష్టి పెట్టారు..

by  |
ఆ అంశంపై సీఎం దృష్టి పెట్టారు..
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై అఘాయిత్యాలను, గంజాయిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. నర్సీపట్నంలో నూతన మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి సుచరిత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతాల, పార్టీలకతీతంగా సీఎం జగన పాలన ఉందని ఆమె అన్నారు. తారతమ్యం లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులు ముందున్నారని ఆమె అన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని ఆమె అన్నారు.



Next Story