స్టోక్స్ క్వారంటైన్ ముగించుకొని వస్తాడు : స్మిత్

by  |
స్టోక్స్ క్వారంటైన్ ముగించుకొని వస్తాడు : స్మిత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘మేం ఈ రోజు 40 ఓవర్లు కూడా సరిగా ఆడలేదు. ఇలాంటి మ్యాచ్‌లలో ఉండే ఒత్తిడిని అధిగమించకపోతే ఓటములే ఎదురవుతాయి. బౌలర్లు తమ పని సరిగానే చేశారు. కానీ కొన్ని పరుగులు అధికంగా ఇచ్చాము. ఇక బ్యాటింగ్ వైఫల్యాలు జట్టును వెంటాడుతున్నాయి. స్టోక్స్ క్వారంటైన్ ముగించుకొని తర్వాత మ్యాచ్‌కు వస్తాడు. కానీ అతడికి ప్రాక్టీస్ ఎక్కువగా లేదు.



Next Story

Most Viewed