ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కేటీఆర్ కీలక ప్రకటన

by  |
ktr twitter
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనే తొలిసారి టీడీఆర్ బ్యాంకు‌ని తీసుకువచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించేందుకు ఎస్ ఆర్‌డీపీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. లాక్ డౌన్ సమయంలోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి సమస్య పరిష్కారానికి 1200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. 450 కోట్లతో ఎల్బీనగర్లో రోడ్లను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 132 లింక్ రోడ్లను నిర్మించి ప్రజా రవాణాను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed