పోలీసులతో మా యుద్ధం అందుకే..

by  |
పోలీసులతో మా యుద్ధం అందుకే..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : తాము పోలీసులతో పోరాటం చేయడానికి అసలు కారణం వారు ప్రభుత్వం తరుఫున ఆయుధాలు పట్టుకున్నందుకేనని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ అన్నారు. సోమవారం హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ పర్యటన అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

జవాన్ల మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నార్త్ బాధ్యత వహించాలన్నారు. తాము జరిపిన దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నామన్నారు. తమ పోరాటం సైనికులతో కాదని ప్రభుత్వంతోనని అభయ్ స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో 28 మంది మావోయిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించారని గుర్తుచేశారు.

Next Story