ఈ కౌన్సిలర్ మాకొద్దు- వికార్ కాలనీ వాసులు

by  |
vikar
X

దిశ,మేడ్చల్ టౌన్ : ప్రజా సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్ చాప రాజు మాకొద్దని వికార్ సెక్షన్‌కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో సమస్యలు పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, తమ కాలనీలో నీరు డ్రైనేజ్, రోడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, మీరు నాకు ఓటేశారా? అని కౌన్సిలర్ తిరిగి ప్రశ్నిస్తున్నాడని ఆరోపించారు. డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు కోసం గత మూడు నెలల కిందట రోడ్లు తవ్వారని, వాటిలో వర్షపు నీరు నిలిచి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన కౌన్సిలర్ తన ఇష్టానుసారంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అనే కాలనీవాసులు ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు



Next Story