మనకు అర్హత లేదంటూ.. ట్విట్టర్ వేదికగా కన్నీరు పెట్టిన యాంకర్ రష్మి.. వీడియో

by  |
మనకు అర్హత లేదంటూ.. ట్విట్టర్ వేదికగా కన్నీరు పెట్టిన యాంకర్ రష్మి.. వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ అంటే బహుషా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండకపోవచ్చు. నటిగా, యాంకర్‌గా రష్మి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో సైతం రష్మి యాక్టివ్‌‌గా ఉంటారు. రష్మి కేవలం యాంకర్‌గా, నటిగా మాత్రమే కాకుండా జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిన విషయమే. అయితే కరోనా సమయంలో కూడా ఆమె మూగజీవాలకు ఆహారం అందించి గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోపై రష్మి ఘాటుగా స్పందించారు.

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్‌ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు కట్టి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. సుమారు 30 నిమిషాల పాటు అలా కొట్టి చంపారని పేర్కొంటూ ఆ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై రష్మి స్పందిస్తూ.. ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తూ ఉండిపోయారు. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. మనకు ఈ భూమీ మీద ఉండే అర్హత లేదు అంటూ ఏడుస్తున్న ఈమోజీని యాడ్ చేసింది.

https://twitter.com/rashmigautam27/status/1444657708464885768?s=20

Next Story

Most Viewed