వారు పోస్టల్ బ్యాలెట్ లేదా నేరుగా ఓటు వేయొచ్చు

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: వికలాంగులు, 80 ఏండ్లకు పైబడిన వారికి, కొవిడ్ బాధితులకు గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వారికి అవకాశం ఇస్తున్నట్టు చెప్పింది. వికలాంగులు, వృద్దుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. వీల్ చైర్లను తీసుకు వెళ్లేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. వికలాంగులు, వృద్దులు, పసిపిల్లల తల్లులు క్యూలైన్ తో [&hellip;]</p>

వారు పోస్టల్ బ్యాలెట్ లేదా నేరుగా ఓటు వేయొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: వికలాంగులు, 80 ఏండ్లకు పైబడిన వారికి, కొవిడ్ బాధితులకు గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వారికి అవకాశం ఇస్తున్నట్టు చెప్పింది. వికలాంగులు, వృద్దుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.

వీల్ చైర్లను తీసుకు వెళ్లేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. వికలాంగులు, వృద్దులు, పసిపిల్లల తల్లులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కొవిడ్ పేషెంట్లు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపింది.

Next Story