హెరాయిన్‌ స్మగ్లింగ్‌పై విచారణ చేస్తున్నాం

by  |
Narayana Swami
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో హెరాయిన్‌ స్మగ్లింగ్‌ జరుగుతుందన్న ఆరోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వెల్లడించారు. విజయవాడలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విచారణలో తప్పు ఎవరిదో తెలుస్తుందని అన్నారు. ఈ విషయంలో తప్పు చేసినట్లు రుజువైతే ఎంతటివారినైనా తమ ప్రభుత్వం విడిచి పెట్టేది లేదని మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు.


Next Story