జట్టుపై నమ్మకం ఉంది : శిఖర్ ధావన్

by  |
జట్టుపై నమ్మకం ఉంది : శిఖర్ ధావన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను కింగ్స్‌ పంజాబ్‌ 19 ఓవర్‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా రాణించి, సెంచరీ బాదినా, జట్టు మాత్రం ఓటమి చెందక తప్పలేదు.

అయితే శిఖర్ ధావన్‌కు మాత్ర మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రావడం సంతోషాన్ని ఇచ్చినా ఆట ఓడిపోవడం మాత్రం చాలా బాధగా ఉన్నది. జట్టు మున్ముందు మళ్లీ విజయాలు సాధిస్తున్నదనే నమ్మకం ఉన్నది.’ అని తెలిపారు.

Next Story

Most Viewed