రేపు నీటి సరఫరా బంద్..

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-30 11:07:11  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో శనివారం నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2, 1400 ఎంఎం డయా మెయిన్‌ రింగ్‌-1 పైపులైన్‌కు శనివారం ఉ. 6 గంటల నుంచి ఆదివారం ఉ. 6 వరకు, అనగా 24 గంటల పాటు అధికారులు మరమ్మతులను చేపడుతున్నారు. దీంతో మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌజ్‌, కాకతీయనగర్‌, హుమాయున్‌నగర్‌, తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్‌, ఎంఈస్‌, షేక్‌పేట్‌, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌ [&hellip;]</p>

రేపు నీటి సరఫరా బంద్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో శనివారం నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2, 1400 ఎంఎం డయా మెయిన్‌ రింగ్‌-1 పైపులైన్‌కు శనివారం ఉ. 6 గంటల నుంచి ఆదివారం ఉ. 6 వరకు, అనగా 24 గంటల పాటు అధికారులు మరమ్మతులను చేపడుతున్నారు.

దీంతో మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌజ్‌, కాకతీయనగర్‌, హుమాయున్‌నగర్‌, తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్‌, ఎంఈస్‌, షేక్‌పేట్‌, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌ నగర్‌ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్‌హిల్స్‌, సచివాలయం, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, గగన్‌మహల్‌, హిమాయత్‌నగర్‌, బుద్వేల్‌, హైదర్‌గూడ, రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, సులేమాన్‌నగర్‌, ఎంఎం పహాడి, అత్తాపూర్‌, చింతల్‌మెట్‌, కిషన్‌బాగ్‌, గంధంగూడ, కిస్మత్‌పూర్‌ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

Next Story