- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చండీగఢ్: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇంటి ముట్టిడికి యత్నించిన స్కూల్ టీచర్లపై పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టెంపరరీ టీచర్స్ యూనియన్ కొన్ని రోజులుగా మొహాలిలోని పంజాబ్ స్కూల్ ఎడ్యూకేషన్ బోర్డు భవనం ముందు నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో సీఎం అమరీందర్ సింగ్ అధికారిక నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టెంపరరీ టీచర్లందరూ సీఎం ఇంటి ముట్టడికి సోమవారం బయల్దేరారు. వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు చండీగఢ్-మొహాలీ సరిహద్దు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని ముందుకు కదిలేందుకు యత్నించిన టీచర్లపై పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఉద్రిక్తతలో పలువురు టీచర్లకు గాయాలైనట్టు ఉపాధ్యాయ యూనియన్ వెల్లడించింది.