ఎస్టీపీలపై దానకిషోర్ సమీక్ష

by  |
ఎస్టీపీలపై దానకిషోర్ సమీక్ష
X

దిశ, హైదరాబాద్: మురుగునీరు శుద్ధి నిర్వహణపై తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్ అధికారులకు ఆదేశించారు. వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లో శుక్రవారం ఎస్టీపీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్టీపీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిజిస్టర్లు, రికార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీల్లో జీఎమ్‌లు, డీజీఎమ్‌లు పర్యటించి మురుగునీరు శుద్ధి తీరును పర్యవేక్షించాలని సూచించారు. అధికంగా మురుగు ప్రవాహం వచ్చే ఉదయం, సాయంకాలం వేళల్లో ఎస్టీపీలను సందర్శించాలని అన్నారు. ఎస్టీపీ ప్రాంగణాల్లో సీసీ టీవి కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని దానకిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో వాటర్ బోర్డు ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed