లంచం తీసుకుంటూ చిక్కిన గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం

by  |
లంచం తీసుకుంటూ చిక్కిన గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ తెలంగాణ గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రిటైర్మెంట్ ఫైల్ కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.75వేలు లంచం తీసుకుంటూ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి చిక్కారు. దీంతో సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కార్యాలయంతో పాటు, సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed