కలెక్టర్ చర్య తీసుకోలేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వార్డ్ మెంబర్

by  |
కలెక్టర్ చర్య తీసుకోలేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన వార్డ్ మెంబర్
X

దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం తుర్కపల్లి గ్రామ సర్పంచ్, ఆమె భర్త పై ఎన్ని సార్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వార్డ్ మెంబర్ సతీష్ వాపోయాడు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక సర్పంచ్ పడాల వనిత నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, సర్పంచ్ భర్త పడాల శ్రీనివాస్ గ్రామ పంచాయతీ లో అజమాయిషీ చేస్తున్నాడని ఆరోపించారు.

ఈ విషయం పైన గతంలో ఎన్నో సార్లు కలెక్టర్‌కి ఫిర్యాదు చెయ్యగా డీపీఓ ఎంక్వయిరీ చేయడం జరిగిందని అందులో దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారణ అయిందన్నారు. అయినా కూడా ఇప్పటికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకే తాను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని వార్డు మెంబర్ సతీష్ పేర్కొన్నారు.

Next Story