పినపాకలో భయం.. భయం.. పులి కోసం అధికారుల జల్లెడ

by  |
పినపాకలో భయం.. భయం.. పులి కోసం అధికారుల జల్లెడ
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పరిధి అటవీప్రాంతంలో పులి భయం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. అమరారం అటవీ ప్రాంతంలోని జూదాల చెరువు వద్ద పులి ఓ ఆవు దూడను చంపేసిన సంగతి తెలిసిందే. ఈ దాడితో ఫారెస్ట్ అధికారులు పులి జాడకోసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో బుధవారం మండలంలోని గోపాలరావుపేట, బాపనకుంట చెరువు వెనుక పులిని చూశామని కొంతమంది వ్యక్తులు తెలిపారు. వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫారెస్ట్ అధికారులు గోపాలరావు పేట ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో బాపనకుంట చెరువు దగ్గర పులి పాదాలను అధికారులు గుర్తించారు. గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి గోపాలరావుపేట అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.


Next Story