- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ నల్లమల అటవీప్రాంతంలో గత మూడు రోజులు వరసగా అటవీశాఖ సంరక్షణ అధికారులకు పెద్దపులి కంట పడినట్లు సమాచారం. ఈ విషయంపై అమ్రాబాద్ డివిజనల్ అధికారి రోహిత్ గొపిడిని ‘దిశ’ వివరణ కోరగా.. గతంతో పోల్చుకుంటే నల్లమల అడవుల్లో పెద్ద పులుల సంచారం సాఫీగా కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మన్ననూర్ రేంజ్ పరిధిలోగల వ్యూ పాయింట్ సఫారీ రోడ్డు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రేంజ్లో ఉన్న అటవీ అధికారులకు పెద్దపులి కనపడిందని తెలిపారు. ఆ సమయంలో అటవీ సిబ్బంది తమ చరవాణిలో పెద్దపులిని చిత్రికరించారనీ తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పెద్ద పులుల సంతానోత్పత్తి కోసం జతకట్టే కాలమని.. కావున వాటికి ఇబ్బంది కలగకుండ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు, జంతు సందర్శుకులను అనుమతించకుండా సఫారీని తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు. గతంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల ఆధారంగా పెద్ద పులుల సంచారం గుర్తించే వారు. నేడు అడవిలో పెద్ద పులికి తగిన సౌకర్యాలు మెరుగుపడటంతో వాటి సమాచారం ప్రత్యక్షంగా అటవీశాఖ అధికారులు చూడటం విశేషం.