- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మునుగోడు: తాటి చెట్లు ఎక్కేందుకు వెళ్లిన కొంత మంది గీత కార్మికులకు పులి కనిపించడంతో భయాందోళనతో పరుగులు తీస్తూ ఇంటికి వచ్చిన ఘటన మునుగోడు మండలం చీకటిమామిడిలో శుక్రవారం జరిగింది. ఘటన అనంతరం పలువురు ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం తాటిచెట్టు ఎక్కేందుకు వెళ్లగా పులి పరిగెత్తుతూ కనిపించిందని.. దాంతో ఒక్కసారిగా భయంతో గ్రామానికి చేరకున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం పరిశోధించి చిరుతపులి ఆనవాళ్లు ఎక్కడా లేవని తెలిపింది. ప్రత్యక్ష సాక్షులను విచారించగా చారలతో ఒక జంతువు కనబడింది కానీ.. మచ్చలు లేవని వెల్లడించారని అటవీ అధికారులు తెలిపారు. దీంతో ఆ జంతువు చిరుతపులి కాదని.. హైనా అయి ఉండొచ్చని వెల్లడించారు. స్థానిక ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దన్నారు.