ఊర చెరువులో వీఆర్ఏ మృతదేహం

by  |
ఊర చెరువులో వీఆర్ఏ మృతదేహం
X

దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తాళ్ళచెరువు గ్రామ ఊర చెరువులో బుధవారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి తిరుమలాయపాలెం పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఘటనా స్థలానికి ఎస్సై రఘు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామానికి చెందిన వీఆర్ఏ పాలపాటి ఉదయ్ కుమార్(33)అనే వ్యక్తి గా గుర్తించారు. ఇతను మంగళవారం తన బంధువులు సీతారాంపురం గ్రామంలో ఉండగా వారి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడ్స్ వచ్చి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. దీనితో పెద్ద పోచారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed