వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా జగ్బీర్ సింగ్!

by  |
వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా జగ్బీర్ సింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా జగ్బీర్ సింగ్‌ను నియమించింది. విశాంత్ వోరా నిష్క్రమణ తర్వాత జగ్బీర్‌కు ఈ బాధ్యతలను అప్పగిస్తూ కంపెనీ నిర్ణయించింది. అదేవిధంగా ఉన్నత స్థాయి నియామక మార్పుల్లో భాగంగా చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా మనీష్ శాన్సీని నియమిస్తూ వొడాఫోన్ ఐడియా వెల్లడించింది.

ఇటీవల చందాదారుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా జగ్‌బీర్ సింగ్ నియామకం జరిగిందని, భవిష్యత్తులో సంస్థ మెరుగైన సేవలను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. జగ్బీర్‌ సింగ్ ఇదివరకు రిలయన్స్ జియోలో గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. జియోలో 4జీ సేవలను ప్రారంభించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. జగ్బీర్‌ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా రావడం ఎంతో సంతోషంగా ఉందని వొడాఫోన్ ఐడియా సీఈవో రవీంద్ర టక్కర్ చెప్పారు.

Next Story

Most Viewed