పట్టించుకోవట్లేదు.. అందుకే కేసులు పెరుగుతున్నాయి: వివేక్

by  |
పట్టించుకోవట్లేదు.. అందుకే కేసులు పెరుగుతున్నాయి: వివేక్
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నిరోధానికి కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీరుగారుస్తున్నదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, ఫాం హౌస్ పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాంట్రాక్టులు, సొంత ఆస్తులు పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.

Next Story