ఫిలిం సిటీలో సాంగ్ కంప్లీట్ చేసిన ‘వాడు-వీడు’

by  |
ఫిలిం సిటీలో సాంగ్ కంప్లీట్ చేసిన ‘వాడు-వీడు’
X

దిశ, వెబ్‌డెస్క్ : గతంలో తమిళ డైరెక్టర్ బాల తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘వాడు వీడు’లో విశాల్, ఆర్యలు నటించి మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి మరో మల్టీస్టారర్ మూవీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ మధ్యే వెలువడింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తుండగా.. అక్టోబర్ 16 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ పూర్తయినట్లు ట్వీట్ చేశాడు హీరో విశాల్. ఈ పాటకు బృంద గోపాల్ కొరియోగ్రఫీ చేయగా.. ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారని తెలిపారు. అరివు అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయని చెప్పాడు.



Next Story