కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ

by  |
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా టీకా మొదటి డోస్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మదీయ ద్వారా షేర్ చేస్తూ అందరు టీకా వేయించుకోవాల్సిందిగా కోరారు. ” అందరు జాగ్రత్తగా ఉండండి.. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోండి” అంటూ పోస్ట్ చేశారు. ఇకపోతే డబ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం ఇండియ‌న్ టీమ్ త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ వెళ్ల‌నుంది. ఇప్పటీకే కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్, తన భార్య అనుష్క శర్మ తో కలిసి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తమ వంతు బాధ్యత గా రెండు కోట్లు విరాళంగా అందించారు.



Next Story