మంత్రి హరీష్ రావ్ కు షాక్.. దత్తత గ్రామంలో దిష్టి బొమ్మ దహనం

by  |
మంత్రి హరీష్ రావ్ కు షాక్.. దత్తత గ్రామంలో దిష్టి బొమ్మ దహనం
X

దిశ,గజ్వేల్ : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గురు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బీజేపీ అధ్వర్యంలో గ్రామస్తులు నిరసన బాట పట్టారు. సోమవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం అని 60 ఇండ్లను కూల్చి నిరుపేదలను రోడ్డున పడేసారని గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. దీంతో చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మొదట గ్రామస్థులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినక పోవటంతో పలువురు బీజేపీ నాయకులను, గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా హరీష్ రావ్ దిష్టి బొమ్మను దహనం చేశారు.

అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ గజ్వేల్ మండలం అధ్యక్షుడు బండారు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే కట్టి ఇవ్వాలన్నారు. లేదంటే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజెవైఎం గజ్వేల్ పట్టణ, మండల అధ్యక్షులు ఆర్కే యాదవ్, వేములవాడ మహేష్ ఆచారి, నాయకులు ఉపేందర్, గోవర్ధన్, అనిల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed