మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. ఏం జరిగిందంటే..

by  |
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. ఏం జరిగిందంటే..
X

దిశ, మద్దూర్ : కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. భూనేడు గ్రామానికి చెందిన ప్రజలు కొత్త బస్టాండు దగ్గర ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. భూనేడును మండల కేంద్రం చేయాలని ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. భూనేడును మండల కేంద్రం చేయకుంటే పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఎమ్మెల్యేను గ్రామస్తులు హెచ్చరించారు. అనంతరం పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Next Story