దొంగతనానికి వెళ్తే కొట్టి చంపిన గ్రామస్తులు..

by  |
దొంగతనానికి వెళ్తే కొట్టి చంపిన గ్రామస్తులు..
X

దిశ, నాగర్ కర్నూల్ : దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని చితకబాదడం మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీఐ గాంధీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. బిజినపల్లి మండలం లక్ష్మీ తండాకు చెందిన పుణ్య నాయక్(39) తరచూ దొంగతనాలకు పాల్పడే వాడు, ఇదే తరుణంలో కారుకొండ గ్రామానికి చెందిన బాలమ్మ అనే వృద్ధురాలి చెవికి ఉన్న గెంటీలు దోచుకునేందుకు ప్రయత్నించాడు.

ఒక చెవికి తొలగించి మరో చెవికి తొలగిస్తున్న క్రమంలో వృద్ధురాలు కేకలు వేసింది. దీంతో గ్రామస్తులు మేల్కొని దొంగని పట్టుకొని చితకబాదారు. ఫలితంగా తీవ్ర గాయాలపాలై.. ఆ వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనిపై మృతుడి భార్య సక్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed