మీ వల్లే వికాస్‌కు ఈ గతి పట్టింది: దూబే భార్య

by  |
మీ వల్లే వికాస్‌కు ఈ గతి పట్టింది: దూబే భార్య
X

యూపీ: వికాస్ దూబే.. పోలీసులను చంపి చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని, మీ వల్లే అతనికి ఈ గతి పట్టిందంటూ వార్తా రిపోర్టర్లపై వికాస్ భార్య రిచా దూబే మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ లోని భైరోఘాట్ లో వికాస్ దూబే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో రిచా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వికాస్ ఎన్ కౌంటర్ కావడంపై స్పందించాలని విలేకర్లు ఆమెను అడిగారు. దీంతో వెంటనే ఆమె వారిపై మండిపడ్డారు. పోలీసులపై మారణకాండకు పాల్పడ్డ వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అంటూ , అతని చావు ఇలా రాసిపెట్టి ఉందన్నది. అనంతరం ఆమె విలేకర్లపై మండిపడుతూ.. మీ వల్లే వికాస్ కు ఈ గతి పట్టిందని, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని విలేకర్లను ఆమె విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. నిన్న కాన్పూర్ సమీపంలో పోలీసులు రౌడీషీటర్ వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed