- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులను కటాక్షించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు ఆశ్వయుజ శుద్ధ తదియ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేద మాతగా ప్రసిద్ది పొంది∙ముక్తా, విద్రమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ గాయత్రీ దేవి పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవతగా అనుగ్రహించింది. సమస్త దేవతా మంత్రాలకీ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవుళ్లకి అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతగా వేదమాతగా కొలుస్తూ, గాయత్రిమాతను దర్శించుకోవడం వల్ల మంత్రిసిద్ధి ఫలాన్ని పొందుతారు.
కనక పుష్యరాగ హారం వితరణ
కనకదుర్గమ్మకు ఎన్ఆర్ఐ భక్తుడు తాతినేని శ్రీనివాస్రూ.45 లక్షల విలువైన కనక పుష్యరాగ హారాన్ని సమర్పించారు. ఈహారాన్ని ప్రతీ గురువారం అమ్మవారికి అలంకరిస్తారు.