- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : కృష్ణానదిలో ఆదివారం జరగాల్సిన దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్ పడింది. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నదిలో తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫంటు మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యదాతథంగా పూజలు నిర్వహిస్తారు. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో అమ్మ, స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తారు.
తెప్పోత్సవం నిర్వహించే ఫంటు సామర్థ్యాన్ని తనిఖీ చేసి ఫిట్ నెస్ దృవపత్రం తీసుకున్నాకే అనుమతిస్తాం అన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ పై భక్తుల రద్దీ నివారణకు చర్యలు తీసుకుంటాం. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ పైవంతెనల పై వాహనాలు, భక్తులు రాకపోకలు ఉండవని స్పష్టం చేశారు.