- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ అంటే కొత్త నిర్వచనాన్ని చెప్పారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కేసీఆర్అంటే కోతి చేష్టల రావు అని ఆమె ఆదివారం సోషల్మీడియా వేదికగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం అవకతవక వాగ్ధానాలతో, అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని రాజ్యంగా చేసి గత్తర పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు శ్రీరంగం ఆలయానికి వెళ్లిన సమయంలో ఏనుగు మొట్టికాయలు వేశాకైనా కేసీఆర్మారుతాడేమో అనుకుంటే అక్కడి నుంచి తిరిగి వచ్చాక బీజేపీని అడ్డుకోండని, ఆ పార్టీ నాయకులను తిరగనియ్యొద్దని చెప్పడంపై సెటైర్లు వేశారు. కొండెంగ చిందుల రావు మరిన్ని తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇక ప్రజల భయానికి జిల్లా పర్యటనలను మరోసారి కుంటి సాకులు చూపి, తప్పించుకుని ఎప్పటిలాగే మోసపు మాటలు చెబుతున్నారని అన్నారు. ఈ వింత, విపరీత, విచిత్ర విన్యాసాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయం కోసం హుజురాబాద్ తీరులో దెబ్బ కొట్టాలని చూస్తున్నారన్నారు.